IPL 2024: జడేజాకు అరుదైన గౌరవం.. ధోనీని పట్టించుకోని చెన్నై ఫ్యాన్స్

IPL 2024: జడేజాకు అరుదైన గౌరవం.. ధోనీని పట్టించుకోని చెన్నై ఫ్యాన్స్

ఐపీఎల్ 2023 టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో జట్టు సమిష్టి ప్రదర్శన చేసినా.. మ్యాచ్ గెలిపించింది మాత్రం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆఖరి బాల్‌‌ వరకు ఉత్కంఠ రేపిన ఐపీఎల్‌‌ ఫైనల్లో జడేజా అద్భుతం చేశాడు. లాస్ట్‌‌ రెండు బాల్స్‌‌కు 10 రన్స్‌‌ అవసరమైన దశలో వరుసగా సిక్స్‌‌, ఫోర్‌‌తో చెన్నైకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో సీఎస్కే 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ గుజరాత్‌‌ టైటాన్స్‌‌ను ఓడించి ఐదోసారి టైటిల్ తన ఖాతాలో వేసుకుంది.
 
సాధారణంగా ఛేజింగ్ లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ లో అది కూడా 2 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో జడేజా సూపర్ కింగ్స్ కు ఊహించని విజయాన్ని అందించాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను గెలిపించేసరికీ జడేజాకు ఫ్యాన్స్ అరుదైన గౌరవం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు గుజరాత్ టైటాన్స్ తో జరగనున్న మ్యాచ్ లో జడేజాకు ఫ్యాన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వనున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 8 నిమిషం అనగా 7:38 నిమిషాలకు జడేజాకు ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నాడు. జడేజా జెర్సీ నెంబర్ 8 కావడంతో ఎనిమిదవ నిమిషంలో చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారట.   

ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై చెన్నై 6 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. నేడు (మార్చి 26) గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. వరుసగా రెండో మ్యాచ్ కూడా సొంతగడ్డపై ఆడనుండడంతో ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.