లైన్​మన్​ ను బూతులు తిట్టి దాడి చేసిన షాపు ఓనర్

లైన్​మన్​ ను బూతులు తిట్టి దాడి చేసిన షాపు ఓనర్

బోధన్​, వెలుగు: నిజామబాద్​ జిల్లాకు చెందిన లైన్​మన్​పై ఓ షాపు ఓనర్ దాడి చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ లోని రాకాసిపేట్ కు చెందిన రాకేశ్​తన షాపుకు సంబంధించి కరెంట్​బిల్లు కట్టలేదు. దీంతో కరెంట్​సప్లై కట్​చేసేందుకు లైన్​మన్ ​గణేశ్​మంగళవారం షాపుకు వెళ్లాడు. బిల్లు కట్టకపోవడంతో సప్లై ఆపేస్తున్నట్లు చెప్పాడు. నా షాపుకొచ్చి కరెంట్​ఎలా కట్​చేస్తావంటూ రాకేశ్​లైన్​మన్​పై తిరగబడ్డాడు. బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ ఘటనలో గణేశ్​తీవ్రంగా గాయపడ్డాడు. లైన్​మన్ ఫిర్యాదుతో కేసు  నమోదు చేసినట్లు ఎస్సై పీటర్​తెలిపారు.