బోధన్, వెలుగు: నిజామబాద్ జిల్లాకు చెందిన లైన్మన్పై ఓ షాపు ఓనర్ దాడి చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ లోని రాకాసిపేట్ కు చెందిన రాకేశ్తన షాపుకు సంబంధించి కరెంట్బిల్లు కట్టలేదు. దీంతో కరెంట్సప్లై కట్చేసేందుకు లైన్మన్ గణేశ్మంగళవారం షాపుకు వెళ్లాడు. బిల్లు కట్టకపోవడంతో సప్లై ఆపేస్తున్నట్లు చెప్పాడు. నా షాపుకొచ్చి కరెంట్ఎలా కట్చేస్తావంటూ రాకేశ్లైన్మన్పై తిరగబడ్డాడు. బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ ఘటనలో గణేశ్తీవ్రంగా గాయపడ్డాడు. లైన్మన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పీటర్తెలిపారు.