సోషల్ మీడియాలో కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు

సోషల్ మీడియాలో కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు

సోషల్ మీడియాలో కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.  శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఏర్పాటుచేసిన థర్మల్ స్ర్కీనింగ్ సెంటర్స్‌ను ఆదివారం పర్యవేక్షించిన ఆయన ఇప్పటివరకు 64వేల ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశారని చెప్పారు. v6తో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన ఆయన… కరోనా వైరస్ వ్యాపించకుండా, విదేశాలనుంచి వచ్చిన వారికి అవసరమైన అన్ని టెస్ట్ లు చేస్తున్నట్లు చెప్పారు. ఆందుకుగాను ఎయిర్ పోర్ట్‌లో 200మంది డాక్టర్లు మూడు విభాగాలుగా  స్క్రీనింగ్ చేస్తున్నారు చెప్పారు. కరోనా ప్రభావం ఉన్న దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు హౌస్ క్వరంటైన్ ద్వార పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.

సదరు ప్రయాణికులకు కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే…ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో ఐసోలేషన్ వార్డ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తే ndps యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మెడికల్ షాప్ లో మాస్క్ లు, సానీటైజర్ లను అధిక ధరలకు విక్రయించకుండా టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విదేశీ ప్రయాణికులకు పకడ్బందీగా స్క్రీనింగ్ చేస్తున్నామని… స్క్రీనింగ్ కు సరైన వ్యవస్థ లేదని అసత్య చారాలను నమ్మవద్దని తెలిపారు.