కానిస్టేబుల్ రాజును పరామర్శించిన స్టీఫెన్‌ రవీంద్ర

కానిస్టేబుల్ రాజును పరామర్శించిన స్టీఫెన్‌ రవీంద్ర

దారి దోపీడీ కేసులో గురువారం దొంగల ముఠాను పట్టుకునే క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఎస్ఓటీ కానిస్టేబుల్ రాజు నాయక్(40)ను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పరామర్శించారు. మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాజు నాయక్ కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రాజు నాయక్ కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. నిందితున్ని పట్టుకునే క్రమంలో.. నిందితుడు రాజు నాయక్ పై కత్తితో దాడి చేశాడని.. కానిస్టేబుల్ ఆరోగ్యం త్వరలోనే బాగుపడుతుందని ఆశిస్తున్నట్టు సీపీ రవీంద్ర విశ్వాసం వ్యక్తం చేశారు.

గురువారం క్రిటికల్ కండిషన్ లో రాజు నాయక్ ను ఆసుపత్రికి తీసుకొని వచ్చినట్టు మెడికవర్ డాక్టర్లు చెప్పారు. రాజు నాయక్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 24గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు. రాజు నాయక్ కు ఎడమ వైపు రెండు కత్తి పోట్లు ఉన్నాయని, బ్లడ్ లాస్ ఎక్కువగా కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.