గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్పరిధిలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ముఠాలపై సైబరాబాద్పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. కల్తీ ఆహారం తయారు చేస్తున్న కేంద్రాలపై దాడులు చేసి 4 నెలల్లో 22 కేసులు నమోదు చేసి 28 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రూ. 64 లక్షల విలువైన కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ఎన్ఫోర్స్మెంట్వింగ్అధికారులు జనవరి 1 నుంచి ఏప్రిల్21 వరకు పలు ఆహార తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. ఇందులో బేకరీ ఉత్పత్తులు, స్వీట్లు, నమ్కీన్, వంటనూనెలు, గోధుమ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్అండ్చికెన్ప్రొడక్ట్స్, ఐస్క్రీమ్స్, సాస్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, సింథటిక్ ఫుడ్కల్సర్, కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు తెలుసుకున్నారు.
తండ్రీ కొడుకుల గలీజ్ దందా..
వట్టినాగులపల్లిలో రూ.10 లక్షల విలువైన 5,026 లీటర్లు కల్తీ వంటనూనె, రూ.3 లక్షల విలువైన 5,192 సాధారణ గోధుమ పిండిని బ్రాండెడ్ పేరుతో విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసులో తండ్రీ కొడుకులను నిందితులు కావడం గమనార్హం. సులభంగా డబ్బు సంపాదించేందుకు వీరు ఈ దందా చేస్తున్నట్టు చెప్పారు. మరో రెండు కేసుల్లో 9.57 లక్షల విలువైన 3809 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా 11 లక్షల విలువైన మూడు టన్నుల వినియోగించిన వంటనూనెను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో 8 లక్షల విలువైన ఐస్ క్రీమ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

