కుండపోత వర్షాలు : తెలంగాణలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

కుండపోత వర్షాలు : తెలంగాణలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో తెలంగాణలో మోస్తారు నుంచి జోరుగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఈ తుఫాన్  రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.

 రెడ్ అలర్ట్ జిల్లాలు

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 5 నుంచి  భారీ నుండి అతి భారీ అత్యంత భారీ   వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  ఈ మూడుజిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు

సూర్యాపేట మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలకు   భారీ నుండి అతిభారీ వర్షాలు పడతాయని..ఈ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఎల్లో అలర్ట్ జిల్లాలు

కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడక్కడ   - భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  డిసెంబర్ 6న కూడా పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

డిసెంబర్ 6న కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడ వర్షాలు  కురిసే అవకాశం ఉంది.