మైనర్ బాలికను ఎవరు కిడ్నాప్ చేయలేదు

మైనర్ బాలికను ఎవరు కిడ్నాప్ చేయలేదు

పాతబస్తీ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదని డబీర్పుర సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మైనర్ బాలికను ఎవరు కిడ్నాప్ చేయలేదని..స్వయంగా తనంతట తానే కారు ఎక్కి వెళ్ళిందని చెప్పారు. బాలిక కుటుంబంతో పరిచయం ఉన్న యువకుడు అమ్మాయిని తీసుకెళ్ళాడని..బాధితురాలు యువకుడి ఇంట్లోనే ఒకరోజు ఉందన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనలో ఇంకెవరిదైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

‘‘ఈ నెల 13న నిందితులు బాలికను తీసుకెళ్లారు. 14న బాలికను ఇంటివద్ద వదిలేసి వెళ్లారు. నిందితులు రెయిన్ బజార్ కు చెందిన సయ్యద్ రావిన్ష్, రియాసత్ అహ్మద్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. బాలికను భరోసా సెంటర్ కు పంపించాం’’ అని సీఐ తెలిపారు. పాతబస్తీలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇద్దరు యువకులు బాలికను కిడ్నాప్ చేసి ఓయో రూమ్ కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన సీఐ గ్యాంగ్ రేప్ జరగలేదని స్పష్టం చేశారు.