
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామికి పాకిస్థాన్ సిటిజన్ షిప్ దక్కనుంది. పాక్ గడ్డపై మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ జరగడం వెనుక సామి చేసిన కృషికి గుర్తింపుగా దేశ పౌరసత్వం ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 23న జరిగే కార్యక్రమంలో తమ ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ గౌరవ పౌరసత్వంతో పాటు పాక్ అత్యున్నత పురస్కారం ‘నిషాన్ ఈహైదర్ ’తో సామిని సత్కరిస్తారని పీసీబీ శనివారం ప్రకటించింది. దాంతో వేరే దేశం నుంచి గౌరవ పౌరసత్వం తీసుకుంటున్న మూడో ఇంటర్నేషనల్ క్రికెటర్ గా సామి నిలువనున్నాడు. గతంలో సెయింట్ కిట్స్ ప్రభుత్వం మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), హెర్షల్ గిబ్స్ (సౌతాఫ్రికా)కు సిటిజన్ షిప్ ఇచ్చింది. 2017లో ఇతర దేశాల క్రికెటర్లు పాక్ వచ్చేందుకు నిరాకరిస్తు న్నసమయంలో డారెన్ పీఎస్ఎల్ లో ఆడాడు. ఆ తర్వా త పాక్ కు వచ్చే విదేశీ క్రికెటర్ల సంఖ్య పెరిగింది.