సీఎం రేవంత్ రెడ్డిది నియంత పాలన! : దాసోజు శ్రవణ్

సీఎం రేవంత్ రెడ్డిది నియంత పాలన! :  దాసోజు శ్రవణ్
  •     దాసోజు శ్రవణ్​​ ఆరోపణ 
  •     భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పాలన నియంత పోకడలతో నడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఫ్యూచర్​ సిటీల్లో భూదొంగలు చెలరేగుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంగళవారం తెలంగాణభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాదర్​గుల్​లో 374 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, కొందరు ఆ భూమి తమదంటూ ఫేక్ డాక్యుమెంట్లతో వస్తున్నారని మండిపడ్డారు. అన్ని భూములు పొంగులేటికి రాసిస్తున్నారా..? ఇదేం చిల్లర రాజకీయమని నిలదీశారు. 

అందరూ వైట్​కాలర్​ క్రిమినల్స్​ అని, భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారని విమర్శించారు. కొత్వాల్ గూడ, మానస హిల్స్, వట్టి నాగులపల్లి, నాదర్ గుల్ లోని వేలాది ఎకరాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్​చేశారు. పొంగులేటి రియల్​ఎస్టేట్​ ప్రెడేటర్​గా మారిపోయారని పండిపడ్డారు.