అమ్మాయిలతో డేటింగ్ యాప్.. ముఠా అరెస్ట్

అమ్మాయిలతో డేటింగ్ యాప్.. ముఠా అరెస్ట్

డేటింగ్ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. కోల్ కతాలో ఉన్న ఈ కాల్ సెంటర్ పై మంగళవారం దాడి చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆనంద్ కర్, బుద్ద పాల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. దేశవ్యాప్తంగా భారీగా మోసాలకు పాల్పడిందీ ముఠా. వీరి నుండి రెండు లాప్ టాప్స్, 24 మొబైల్ ఫోన్స్, 51 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు.