కూతురు గొంతు కోసి ఉరేసిండు..

కూతురు గొంతు కోసి ఉరేసిండు..

బెంగళూరు: తన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెండ్లి చేసుకోబోతోందన్న కోపంతో కన్న తండ్రే ఆమె గొంతు కోశాడు. ఆపై ఆమెను ఫ్యాన్​కు ఉరివేశాడు. తన ప్రియురాలు లేదని తెలిసి ఆమె ప్రియుడు తల్లడిల్లిపోయాడు. ఆమె లేని జీవితం వద్దనుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) లోని బంగారు పేటలో బుధవారం ఈ ఘటన జరిగింది. 

ఆత్మహత్యగా నమ్మించేందుకు ఉరివేసిండు..

బంగారుపేటకు చెందిన కృష్ణమూర్తి కూతురు కీర్తి(20) వేరే కులానికి చెందిన గంగాధర్(24) అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం తెలిసి తండ్రి ప్రశ్నించగా ఆమె అతడినే పెండ్లి చేసుకుంటానని చెప్పింది. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న గంగాధర్​ను, కీర్తిని తండ్రి కృష్ణమూర్తి పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినిపించుకోలేదు. పెద్దలను ఎదిరించైనా పెండ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డారు. ఇదే విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది. కోపం పట్టలేక కృష్ణమూర్తి కూతురు గొంతు కోసి చంపేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డెడ్​బాడీని ఫ్యాన్​కు తాడుతో వేలాడదీశాడు. ఈ విషయం గంగాధర్​కు తెలియడంతో తట్టుకోలేకపోయాడు. రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. పరువు హత్యగా అనుమానించిన పోలీసులు కృష్ణమూర్తిని విచారించి అరెస్ట్ చేశారు.