గ్యాంగ్స్టర్ కమ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ఎన్ కౌంటర్ తర్వాత.. అతని లాయర్ దయాశంకర్ మిశ్రా ఇంటిపై క్రూడ్ బాంబు విసరడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన ప్రయాగ్ రాజ్ లోని కత్రా ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా చేసుకుని ఇలా చేశారు, విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని వారు స్పష్టం చేశారు
ఈ ఘటనపై ప్రయాగ్రాజ్ సీపీ మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదమే బాంబు దాడికి కారణమైనట్టు తెలిపారు. అతిక్ అహ్మద్ తరపు న్యాయవాది దయాశంకర్ మిశ్రాపై ప్రమాదవశాత్తూ బాంబు పేలిందని, గ్యాంగ్స్టర్ హత్యకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చి చెప్పారు.