ఉప్పల్, వెలుగు: డీసీఎం ఢీకొని మహిళ చనిపోయిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం మనోపాడ్ గ్రామానికి చెందిన సరస్వతి(58) పదిహేను రోజుల కిందట రామంతాపూర్లోని మహేశ్వరి నగర్ కాలనీలో ఉంటున్న కొడుకు దిలీప్ రెడ్డి దగ్గరికి వచ్చింది. బుధవారం తల్లిని తిరిగి సొంతూరికి పంపించేందుకు దిలీప్ బైక్పై రామంతాపూర్లోని హోమియో కాలేజీ బస్టాప్ వద్దకు తీసుకొచ్చాడు.
తల్లీ, కొడుకు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. అదే టైమ్లో ఉప్పల్ నుంచి కోఠి వైపు బర్రెల లోడ్తో వస్తున్న డీసీఎం అదుపుతప్పి సరస్వతిని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్బాడీని ఉస్మానియాకు తరలించారు. డీసీఎం డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి డ్రైవర్ను అరెస్ట్ చేశామన్నారు.