కామారెడ్డి టౌన్, వెలుగు : అధిక శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాసవీ కన్యక పరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం లక్ష గాజులతో అలంకరించారు. ధర్మశాల నుంచి లక్ష గాజులను ఊరేగింపుగా టెంపుల్ వరకు తీసుకెళ్లి, గాజులతో అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు.
ఆర్యవైశ్య సంఘం టౌన్ప్రెసిడెంట్మోటూరి శ్రీకాంత్, జనరల్ సెక్రెటరీ మోగిలిపల్లి భూమేశ్, ప్రతినిధులు శ్రీనివాస్, యాద అంజయ్య, గరిపల్లి శ్రీధర్పాల్గొన్నారు.