కామారెడ్డి  జిల్లా కేంద్రంలో లక్ష గాజులతో  అమ్మవారికి అలంకరణ

కామారెడ్డి  జిల్లా కేంద్రంలో లక్ష గాజులతో  అమ్మవారికి అలంకరణ

కామారెడ్డి టౌన్, వెలుగు : అధిక శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కామారెడ్డి  జిల్లా కేంద్రంలో వాసవీ కన్యక పరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం లక్ష గాజులతో  అలంకరించారు. ధర్మశాల నుంచి లక్ష  గాజులను ఊరేగింపుగా టెంపుల్ వరకు  తీసుకెళ్లి, గాజులతో అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు.

ఆర్యవైశ్య సంఘం టౌన్​ప్రెసిడెంట్​మోటూరి శ్రీకాంత్, జనరల్ సెక్రెటరీ మోగిలిపల్లి భూమేశ్, ప్రతినిధులు శ్రీనివాస్, యాద అంజయ్య, గరిపల్లి శ్రీధర్​పాల్గొన్నారు.