
హైదరాబాద్, వెలుగు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 14 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని డీఈఈసెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు.
జూన్ 17 వరకూ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 20న కాలేజీల్లో సీట్లను అలాట్ చేయనున్నట్టు చెప్పారు. సీట్లు అలాటైన విద్యార్థులు జూన్ 21 నుంచి 24 వరకూ ట్యూషన్ ఫీజు చెల్లించి, కాలేజీ అలకేషన్ లెటర్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
జులై 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఈ నెల 9 నుంచి 13 వరకూ సర్కారు డైట్ కాలేజీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయిందని చెప్పారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in వెబ్సైట్ చూడాలని సూచించారు.