ఢిల్లీలోని సరోజినీ నగర్ సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద 2024 జనవరి 10వ తేదీ బుధవారం రోజున క్రేన్ను ట్రక్కు ఢీకొంది. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు, క్రేన్ రోడ్డు పక్కన నిలిచిపోవడంతో రోడ్డుపై కిలోమీటర్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈరోజు తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రమాదంలో ట్రక్కు దారుణంగా దెబ్బతింది. లారీని, క్రేన్ను రోడ్డుపై నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే పొగమంచు ఈ ప్రమాదానికి కారణం కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రోడ్డుపై నుంచి లారీని, క్రేన్ను తొలగించి ట్రాఫిక్ను సులభతరం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే మార్గం గుండా రోజు ఆఫీసులకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.