ఏలూరులో అస్వస్థకు కారణాన్ని వెల్లడించిన ఎయిమ్స్

ఏలూరులో అస్వస్థకు కారణాన్ని వెల్లడించిన ఎయిమ్స్

ఏలూరులో అస్వస్థకు లెడ్ హెవీ మెటల్ కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.  పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ లో ఎక్కువగా “లెడ్” అనే హెవీ మెటల్, మరియు నికెల్ అనే మెటల్ ఎక్కువుగా వున్నట్లు ఎయిమ్స్ ఢిల్లీలో పరీక్షల్లో తెలిసిందన్నారు.  లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తాయని.. “లెడ్” బ్యాటరీస్ లో ఉండే పదార్ధం. ఇది తాగు నీటి ద్వారా, లేదా పాల ద్వారా పేషెంట్స్ శరీరంలో వెళ్లి ఉండవొచ్చని డాక్టర్లు అంచనా వేసినట్లు చెప్పారు. శాంపిల్స్ టెస్ట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ మంగళగిరి ద్వారా అందజేయటం జరిగిందన్నారు. వెంటనే ఏ మార్గం ద్వారా పేషేంట్ల శరీరాల్లోకి ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ స్థానికంగా తెలుసుకోవాలన్నారు.  స్థానికంగా ఉన్న వాటర్, పాల శాంపిల్స్ పంపించాలని ఎయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరింది.  మెటల్స్ ను డిటెక్ట్ చేసే అధునాతన పరికరాలు ఎయిమ్స్ ఢిల్లీలో మాత్రమే ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలన్నారు.