
న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఇప్పుడిప్పుడే విజయాల బాట పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్లో ఒక మార్పు చోటు చేసుకున్నది. గాయపడిన పేసర్ కమలేష్ నాగర్కోటి ప్లేస్లో ఉత్తరప్రదేశ్ బ్యాటర్ ప్రియమ్ గార్గ్ను టీమ్లోకి తీసుకుంది. లోయర్ బ్యాక్ ఇంజ్యురీతో కమలేష్ ఈ ఐపీఎల్కు దూరమయ్యాడు. గార్గ్ను రూ. 20 లక్షల బేస్ప్రైస్కే డీసీ కాంట్రాక్ట్ చేసుకుంది. ఈ అటాకింగ్ బ్యాటర్ను మొదట 2020లో సన్రైజర్స్ టీమ్లోకి తీసుకుంది. ఓవరాల్గా ఐపీఎల్లో అతను 21 మ్యాచ్లు ఆడాడు. పెద్దగా ఫామ్లో లేకపోవడంతో రైజర్స్ అతన్ని వదిలేసుకుంది. అయితే డీసీలో పవర్ హిట్టర్స్ లేకపోవడంతో గార్గ్కు చాన్స్ ఇచ్చింది.