
న్యూఢిల్లీ: ఐపీఎల్16లో ఐదు ఓటముల తర్వాత గెలుపు రుచి చూసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కు మరో విషయంలో ఊరట లభించింది. ఈ నెల 15న బెంగళూరు నుంచి ఢిల్లీ వస్తుండగా దొంగతనానికి గురైన ఆ టీమ్ కిట్లు దొరికాయి. దొంగలు కూడా పట్టుబడ్డారు. ఈ విషయాన్ని ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ప్లేయర్ల కిట్ బ్యాగ్స్ నుంచి16 బ్యాట్లతో పాటు ప్యాడ్లు, గ్లోవ్స్, బూట్లు, థై ప్యాడ్స్ మిస్సయ్యాయని ఢిల్లీ టీమ్ తెలిపింది. దొంగలను పట్టుకొని తమ కిట్లను రికవర్ చేశారని వార్నర్ తెలిపాడు. వాళ్ల నుంచి సేకరించిన బ్యాట్స్, ప్యాడ్స్ ఫొటోను షేర్ చేశాడు. ఇంకా కొన్ని బ్యాట్లు మిస్సయినప్పటికీ సిబ్బందికి థ్యాంక్స్ చెప్పాడు.