ఢిల్లీ క్యాపిటల్స్​ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఊరట

 ఢిల్లీ క్యాపిటల్స్​ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఊరట

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌16లో ఐదు ఓటముల తర్వాత గెలుపు రుచి  చూసిన ఢిల్లీ క్యాపిటల్స్​ టీమ్‌‌‌‌‌‌‌‌కు మరో విషయంలో ఊరట లభించింది. ఈ నెల 15న బెంగళూరు నుంచి ఢిల్లీ వస్తుండగా దొంగతనానికి గురైన ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ కిట్లు దొరికాయి. దొంగలు కూడా పట్టుబడ్డారు. ఈ విషయాన్ని ఢిల్లీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వెల్లడించాడు.  ప్లేయర్ల కిట్​ బ్యాగ్స్​ నుంచి16  బ్యాట్లతో పాటు ప్యాడ్లు,  గ్లోవ్స్‌‌‌‌‌‌‌‌, బూట్లు, థై ప్యాడ్స్​ మిస్స​య్యాయని ఢిల్లీ టీమ్​ తెలిపింది. దొంగలను పట్టుకొని తమ కిట్లను రికవర్​ చేశారని  వార్నర్​ తెలిపాడు. వాళ్ల నుంచి సేకరించిన బ్యాట్స్, ప్యాడ్స్​ ఫొటోను షేర్​ చేశాడు.  ఇంకా కొన్ని బ్యాట్లు మిస్సయినప్పటికీ సిబ్బందికి థ్యాంక్స్​ చెప్పాడు.