గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని గుజరాత్ బౌలర్లు హడలెత్తించారు. షమీ3 వికెట్లు తీసుకోగా..అల్జారీ జోసెఫ్ 2 వికెట్లతో సత్తా చాటాడు.
బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఓపెనర్ పృథ్వీ షా (7) వికెట్ను ఢిల్లీ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ (4) మరోసారి విఫలమయ్యాడు. ఈ సమయంలో కెప్టెన్ వార్నర్(37), సర్ఫరాజ్ ఖాన్ (30) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్కు 30 పరుగులు జోడించారు. అయితే బౌలింగ్కు వచ్చిన అల్జారీ జోసెఫ్ వరుస బంతుల్లో వార్నర్, రైలీ రోసో (0)లను ఔట్ చేసి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టాడు. చివర్లో అక్షర్ పటేల్ ధాటిగా ఆడటంతో ఢిల్లీ 162 పరుగులు సాధించింది.