
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ గత ఐదు మ్యాచ్ల్లో నాలుంగింట విక్టరీ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్ల్లో గెలుపొందింది. ఇక ఐపీఎల్లో గుజరాత్, ఢిల్లీ ఇప్పటివరకు రెండు మ్యాచ్ల్లో తలపడ్డాయి. రెండు మ్యాచ్ల్లోనూ గుజరాత్ టైటాన్సే విజయం సాధించడం విశేషం.
జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, రిలీ రోసోవ్, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, నోకియా, ఇషాంత్ శర్మ.
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమి, మోహిత్ శర్మ, జోష్ లిటిల్.