ఆక్సిజన్ అందక మరో 12 మంది మృతి

ఆక్సిజన్ అందక మరో 12 మంది మృతి

ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక 12 మంది కరోనా పేషెంట్లు చనిపోయారు. బాత్రా హాస్పిటల్‌లో ఈ ఘోరం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలోని ఆరుగురు పేషెంట్లు, జనరల్ వార్డులోని మరో ఆరుగురు పేషంట్లు ఆక్సిజన్ అందక మరణించారు. ఎంత ప్రయత్నించినా... వారిని కాపాడలేకపోయామని బాత్రా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గుప్తా అన్నారు. కరోనా బారినపడి తమ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ హిమ్తాని చనిపోయినట్లు ఆయన తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పట్నుంచి ఆక్సిజన్ సప్లై ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు. ఆక్సిజన్ కోసం తమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని చెప్పారు. ఆక్సిజన్ సప్లయర్స్ తమ ఫోన్లు ఎత్తడం లేదని ఆయన ఆరోపించారు.