ఢిల్లీ ఎక్సైజ్ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను దాటవేయనున్నారు. జనవరి 3న హాజరు కావాలని కేంద్ర ఏజెన్సీ ఆయనను కోరింది. ఆయన ఇలా సమన్లను దాటవేయడం అనేది ఇది మూడోసారి. అంతకుముందు సమన్లు చట్టవిరుద్ధమని ఢిల్లీ ముఖ్యమంత్రి అభివర్ణించారు.
పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈడీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారం చేయకుండా నిరోధించడానికి అతన్ని అరెస్టు చేయాలనే ఉద్దేశ్యంతో నోటీసు పంపారని, ఇది చట్టవిరుద్ధమని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Delhi CM Arvind Kejriwal will not go to the ED office today, CM wrote to ED.
— ANI (@ANI) January 3, 2024
"Ready to cooperate in ED investigation but the agency's notice is illegal. Their intention is to arrest Arvind Kejriwal. They want to stop him from election campaign: AAP https://t.co/Wh1GzkDAK4