కరోనాతో అసిస్టెంట్ సబ్ ఇనిస్పెక్టర్ మృతి

కరోనాతో అసిస్టెంట్ సబ్ ఇనిస్పెక్టర్ మృతి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారిన పడి ఢిల్లీలో ఓ అసిస్టెంట్ సబ్- ఇనిస్పెక్టర్ చనిపోయారు. ఆయనకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో వారం నుంచి ఆర్మీ బేస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఏఎస్సై చనిపోయారని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సెంట్రల్) సంజయ్ భాటియా మీడియాకు వెల్లడించారు. అంతకు ముందు నెలలో ఢిల్లీలోని భరత్ నగర్ పీఎస్ లో 31 ఏళ్ల కానిస్టేబుల్ కరోనా బారిన పడి చనిపోయారు. మాజీ ఆర్మీ సిబ్బంది అయిన ఏఎస్సై మధ్యప్రదేశ్​లోని రేవా జిల్లాకు చెందినవారు. 2014లో ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్​లో చేరారు. సెంట్రల్ ఢిల్లీలోని కమలా మార్కెట్ ప్రాంతంలో క్రైం బ్రాంచ్​లో ఏఎస్సైగా విధుల్లో ఉన్నారు.