గుజరాత్‎లోనూ అవినీతిని అంతం చేయబోతున్నాం

గుజరాత్‎లోనూ అవినీతిని అంతం చేయబోతున్నాం

ఢిల్లీలో అవినీతిని అంతం చేశామని.. అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లోనే పంజాబ్‎లో అవినీతి అంతమైందని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. త్వరలోనే గుజరాత్‎లోనూ అవినీతిని అంతం చేయబోతున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గుజరాత్ నుంచి 182 సీట్లకు పోటీ చేస్తామని ఆయన తెలిపారు. గుజరాత్ టూర్ లో ఉన్న ఆయన.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి తిరంగాయాత్ర నిర్వహించారు. ర్యాలీలో జాతీయ జెండాలతో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఏడాది గుజరాత్‎లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గుజరాత్‎లో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది.

For More News..

‘బీస్ట్’ ట్రైలర్ మామూలుగా లేదుగా..

ఎమ్మెల్యేని ప్రశ్నించిన యువకుల అరెస్ట్