తగ్గుతున్న కేసులు.. ఆంక్షలు సడలిస్తున్న సర్కారు

తగ్గుతున్న కేసులు.. ఆంక్షలు సడలిస్తున్న సర్కారు

ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో అమలు చేస్తున్న వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్కు పంపింది. షాపులు, కమర్షియల్ కాంప్లెక్సులు తెరిచేందుకు ఇప్పటి వరకు అమల్లో ఉన్న సరి, బేసి విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ ఆఫీసులకు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం అమలులో ఉండగా.. 50శాతం సామర్థ్యంతో పనిచేసేందుకు అనుమతించనుంది. ఢిల్లీలో గురువారం 12,306 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య అంతకు ముందు రోజుతో పోలిస్తే 10.72 శాతం తక్కువ. పాజిటివిటీ రేటు తగ్గుతున్నందున ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలు సడలించాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగానే వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి...

సోమ్నాథ్ ఆలయంలో కొత్త సర్క్యూట్ హోమ్స్

ఏపీ ఎక్స్ప్రెస్లో పొగలు