సోమ్నాథ్ ఆలయంలో కొత్త సర్క్యూట్ హోమ్స్

సోమ్నాథ్ ఆలయంలో కొత్త సర్క్యూట్ హోమ్స్

గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ సమీపంలో కొత్త సర్క్యూట్ హౌస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. కొత్త సర్క్యూట్ హౌస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మోడీ ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది. సోమనాథ్ ఆలయ సమీపంలో కొత్త సర్క్యూట్ హౌస్ ప్రారంభం వల్ల యాత్రికులకు చాలా ప్రయోజనం చేకూరుతుందని మోడీ ట్వీట్ చేశారు. 

ఇకపోతే, ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ, విదేశాల నుంచి వచ్చి సోమనాథ్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న అతిథి గృహాలు ఆలయానికి దూరంగా ఉండటంతో కొత్త భవనాలను నిర్మించారు. రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలు.. గుడికి సమీపంలో ఉన్నాయి. ప్రతి గది నుంచి సముద్రం కనిపించేలా ల్యాండ్ స్కేపింగ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం:

మనసులు గెలిచిన శివకార్తికేయన్

వారం మొత్తం పడిన కష్టం మరచిపోవాలంటే..