
- ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో ఘటన
దహెగాం, వెలుగు: కుమ్రభీం ఆసిఫాబాద్జిల్లాలో భార్యతో కలిసి కూతురు డెలివరీకి వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. బెజ్జూర్ మండలం సలుగుపల్లికి చెందిన దుర్గం బిక్కయ్య(50), పోషక్క దంపతుల కూతురు నిండు గర్భిణి. మంగళవారం మంచిర్యాలలోని హాస్పిటల్లో డెలివరీ చేస్తుండడంతో బిక్కయ్య భార్యను తీసుకుని తన ఎక్స్ఎల్బైక్పై మంచిర్యాల బయలుదేరాడు.
మొదట కుమ్మరపల్లి వెళ్లి అక్కడి నుంచి తన బావమరిదితో కలిసి ఆటోలో మంచిర్యాల వెళ్దామని అనుకోగా, దహెగాం మండలంలోని కమ్మరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వచ్చిన ఎడ్ల బండి నొగలు గుచ్చుకుని బిక్కయ్య అక్కడికక్కడే చనిపోయాడు. పోషక్కకు గాయాలయ్యాయి. ఎస్సై సనత్ కుమార్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.