
ముంబై : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రిక్రూట్మెంట్ జోరు తగ్గినప్పటికీ ఈఆర్పీ, ఆటోమోటివ్ డిజైన్, టెస్టింగ్ వంటి ఫంక్షనల్ స్కిల్స్కు డిమాండ్ పెరుగుతున్నట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది రెండో క్వార్టర్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగినట్లు తెలిపింది. జియో పొలిటికల్ టెన్షన్లు తగ్గేదాకా వేచి చూద్దామనే ఐటీ కంపెనీల వైఖరి కారణంగా కొత్త రిక్రూట్మెంట్లు ఎక్కువగా సాగట్లేదని ఆ రిపోర్టు పేర్కొంది. బిజినెస్ సొల్యూషన్స్ ప్రొవైడర్ క్వెస్ కార్ప్ తన స్కిల్స్ రిపోర్టులో పై విషయాలను వెల్లడించింది. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ), డెవలప్మెంట్ ఆటోమోటివ్ డిజైన్, టెస్టింగ్ వంటి సెగ్మెంట్లలో మాత్రం ఈ ఏడాది రెండో క్వార్టర్లో నియామకాలు ఊపందుకున్నాయని క్వెస్కార్ప్ రిపోర్టు వివరించింది.
ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నాలు మరికొంత కాలం కొనసాగొచ్చని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈఓ విజయ్ శివరామ్ చెప్పారు. కానీ, మాస్టర్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఎంఎస్పీ), రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (ఆర్పీఓ), ప్రీ–అసెస్డ్ హైరింగ్ వంటివి ఐటీ కంపెనీలకు ఇప్పటికే ముఖ్యమైన మోడల్స్గా మారాయని తెలిపారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) ఎకో సిస్టమ్ పెరుగుతోందని, జెన్ ఏఐ రాకతో మన ఐటీ రంగంలోనూ ఇంటిగ్రేషన్ ఆవశ్యకత దృష్ట్యా కొత్త టెక్నాలజీలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
వీటికి భవిష్యత్లోనూ మెరుగైన అవకాశాలే ఉంటాయని వెల్లడించారు. అప్స్కిల్లింగ్లో ఇన్వెస్ట్ చేసే వారికి తగిన అవకాశాలే దొరుకుతున్నాయని, రాబోయే రెండేళ్లలో ఏఐలో పెట్టుబడులు పెట్టాలని 85 శాతం ఇండియన్ బిజినెస్లు ప్లాన్ చేస్తున్నాయని శివరామ్ వివరించారు. క్వెస్ ఐటీ స్టాఫింగ్ ఆపరేషన్స్ డేటా ఆధారంగా తాజా రిపోర్టును తెచ్చారు. పైన చెప్పుకున్న స్కిల్స్తోపాటుగా, జెన్ ఏఐ, డేటా సైన్స్, డెవ్ఆప్స్, క్లవుడ్, ఆటోమోటివ్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ స్పెషలిస్టులకు ఇంక్రిమెంటల్ డిమాండ్ కనిపిస్తోందని రిపోర్టు పేర్కొంది.
టెక్నాలజీ హబ్గా పేరొందిన బెంగళూరు సిటీకి బయట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ విస్తరిస్తుండటంతో ఇండస్ట్రీలోనూ కొంత మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వెల్లడించింది. పుణె, హైదరాబాద్, ముంబై, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) వంటి సిటీలు కూడా టెక్ హబ్స్గా అవతరిస్తున్నాయని తెలిపింది. ఆయా సిటీలలో దేశీయ కంపెనీలతోపాటు, విదేశీ కంపెనీలు కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, దీంతో అవి కూడా టెక్నాలజీ హబ్లుగా మారుతున్నాయని క్వెస్కార్ప్ రిపోర్టు వివరించింది.