12.7 కోట్లకు డీమ్యాట్​ అకౌంట్లు .. ఆగస్టులో 26 శాతం పెరిగాయ్​

12.7 కోట్లకు డీమ్యాట్​ అకౌంట్లు .. ఆగస్టులో 26 శాతం పెరిగాయ్​

న్యూఢిల్లీ: స్టాక్‌‌‌‌ మార్కెట్లు మంచి రిటర్నులు ఇస్తుండడంతో పాటు, అకౌంట్​ ఓపెన్​ చేయడం మరింత ఈజీ కావడంతో ఆగస్టు నెలలో డీమ్యాట్​ అకౌంట్లు 26 శాతం పెరిగి 12.7 కోట్లకు చేరాయి. జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో ఎక్కువ ఖాతాలు యాడ్​ అయినట్లు డేటా చెబుతోంది. 2023 లో నెలకు సగటున 21 లక్షల డీమ్యాట్​ అకౌంట్లు ఓపెనవుతుండగా, ఆగస్టు నెలలో ఈ సంఖ్యను దాటిపోయినట్లు మోతీలాల్​ ఓస్వాల్​ ఎనాలిసిస్​  వెల్లడించింది. కొత్త అకౌంట్ల ఓపెనింగ్​ ఆగస్టు నెలలో 4.1 శాతం పెరిగి మొత్తంగా 31 లక్షల అకౌంట్లు యాడ్ అయినట్లు పేర్కొంది. అంతకు ముందు జులై 2023 నెలలో 30 లక్షల డీమ్యాట్​ అకౌంట్లు కొత్తగా ఓపెన్​ అయ్యాయి. రెండు డిపాజిటరీలు... ఎన్​ఎస్​డీఎల్, సీడీఎస్​ఎల్ వద్ద ఆగస్టు నెలాఖరు నాటికి డీమ్యాట్​ అకౌంట్ల సంఖ్య 12.7 కోట్లకు చేరినట్లు వివరించింది.

అంతకు ముందు ఏడాది అంటే ఆగస్టు 2022 చివరినాటికి ఈ డీమ్యాట్​ ఖాతాల సంఖ్య 10.1 కోట్లు మాత్రమే. 12.7 కోట్ల అకౌంట్లలో ఎన్​ఎస్​డీఎల్​ వద్ద 3.3 కోట్లు, సీడీఎస్​ఎల్​ వద్ద 9.35 కోట్లు ఓపెన్​ అయినట్లు సెబీ డేటా వెల్లడిస్తోంది. ఈక్విటీ మార్కెట్లు మంచి లాభాలు ఇస్తుండటంతోపాటు, బ్రోకర్లు అకౌంట్​ ఓపెనింగ్​ను సులభం చేయడం వల్లే డీమ్యాట్ అకౌంట్లు వేగంగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎన్​ఎస్​ఈలో యాక్టివ్​ క్లయింట్లు గత రెండు నెలలుగా అధికమవుతున్నారు. ఆగస్టు నెలలో యాక్టివ్​ యూజర్​ క్లయింట్లు 2.5 శాతం పెరిగి 3.27 కోట్లకు చేరారు. టాప్​ ఫైవ్​ డిస్కౌంట్​ బ్రోకింగ్​ కంపెనీలు జెరోధా, ఏంజిల్​వన్​, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్​, ఐఐఎఫ్ఎల్​ సెక్యూరిటీస్​లు 60.8 శాతం మార్కెట్​ వాటా దక్కించుకున్నాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే ఈ అయిదుగురు బ్రోకర్ల వాటా కొద్దిగా తగ్గింది.