మూసీ పరీవాహక ప్రాంతాల్లో..అక్రమ నిర్మాణాల కూల్చివేత

మూసీ పరీవాహక ప్రాంతాల్లో..అక్రమ నిర్మాణాల కూల్చివేత

గండిపేట, వెలుగు : హైదరాబాద్​లోని రాజేంద్రనగర్​ నియోజకవర్గంలో మూసీ పరీవాహక ప్రాంతంలో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చి వేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదర్​ఎన్‌క్లేవ్‌ కాలనీకి చెందిన కొందరు.. స్థానిక మూసీ నది బఫర్​జోన్​లో అక్ర మంగా నిర్మాణాలు చేపట్టారని అధికా రులు గుర్తించారు. శనివారం పోలీసు​ బందోబస్తు ​నడుమ వాటిని కూల్చివే శారు.

ఈ సందర్భంగా తహసీల్దార్‌ రాములు మాట్లాడుతూ.. వరద పోటెత్తినప్పుడు హిమాయత్‌సాగర్‌ గేట్లు ఓపెన్​చేస్తే ఇటువైపుగానే మూసీ ప్రవహిస్తుందన్నారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా బఫర్​జోన్​లో నిర్మాణాలు చేపట్టారని, దీంతో వరద నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింద న్నారు. ఒక్కొక్క అక్రమ నిర్మాణాన్ని గు ర్తించి కూల్చి వేస్తున్నామన్నారు.