గండిపేట, వెలుగు : హైదరాబాద్లోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మూసీ పరీవాహక ప్రాంతంలో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చి వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదర్ఎన్క్లేవ్ కాలనీకి చెందిన కొందరు.. స్థానిక మూసీ నది బఫర్జోన్లో అక్ర మంగా నిర్మాణాలు చేపట్టారని అధికా రులు గుర్తించారు. శనివారం పోలీసు బందోబస్తు నడుమ వాటిని కూల్చివే శారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రాములు మాట్లాడుతూ.. వరద పోటెత్తినప్పుడు హిమాయత్సాగర్ గేట్లు ఓపెన్చేస్తే ఇటువైపుగానే మూసీ ప్రవహిస్తుందన్నారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా బఫర్జోన్లో నిర్మాణాలు చేపట్టారని, దీంతో వరద నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింద న్నారు. ఒక్కొక్క అక్రమ నిర్మాణాన్ని గు ర్తించి కూల్చి వేస్తున్నామన్నారు.