
అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన చిత్రం ‘డీమాంటీ కాలనీ2’. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హీరో అరుల్ నిధి మాట్లాడుతూ ‘తమిళంలో మా సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులు కూడా పెద్ద సక్సెస్ ఇచ్చారు.
ఇక్కడ రిలీజ్ చేసిన సురేష్ రెడ్డి గారు మా కంటే ఎక్కువగా మా సినిమాను నమ్మారు.ఇది పర్ఫెక్ట్ సీక్వెల్ అని ఆడియెన్స్ చెబుతున్నారు. ఇదొక ఫ్రాంచైజీగా రూపొందిస్తున్నాం.‘డీమాంటీ కాలనీ 3’ బిగ్ స్పాన్గా రాబోతోంది. ఎన్నో ట్విస్టులు, టర్న్లతో ఉండబోతోంది.
ఇందులో కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి. నా కెరీర్లో ఎక్కువగా థ్రిల్లర్స్, సస్పెన్స్ మూవీస్ చేశా.అయితే నాకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. ఈ ఫ్రాంచైజీ ద్వారా ఆ గుర్తింపు దక్కుతుందని భావిస్తున్నా’ అని చెప్పాడు.