వర్మ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ

వర్మ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఆయన తీసిన లేటెస్ట్  సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు.  ఇవాళ(శనివారం) ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు చూశారు. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, ప్రముఖులను కించపరిచే సీన్స్ ఉండటంతో సర్టిఫికెట్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. అంతేకాదు పాత్రలను మార్చి రీషూట్ చేయాల్సిందేనని నిర్మాతలకు తేల్చి చెప్పారు. సినిమాలో తొలగించాల్సిన సీన్స్ 80 శాతం వరకూ ఉన్నాయని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో రివైజింగ్ కమిటీకి వెళ్లాలని సినిమా నిర్మాతలు నిర్ణయించారు.