ఎక్కువ వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బు, బంగారం డిపాజిట్

ఎక్కువ వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బు, బంగారం డిపాజిట్

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. డిపాజిట్ల ద్వారా వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బును జమ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఎక్కువ శాతం వడ్డీ వచ్చేలా బంగారాన్ని కూడా 5 ఏళ్లకు డిపాజిట్ చేయాలనుకుంది. మరోవైపు స్వామివారికి ఇప్పటికీ పాత నోట్లు వస్తుండటంపై కూడా సమావేశంలో చర్చించారు.

ఈ నోట్లను మార్పిడి చేయడంపై ఆర్బీఐతో చర్చించాలని నిర్ణయించారు టీటీడీ పాలకమండలి సభ్యులు. అవసరమైతే పార్లమెంట్ లో ఎంపీల ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తించాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. తిరుమల కొండపై తాగునీటి సరఫరా కోసం రూ.10 కోట్లను కేటాయించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ విధానంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి, అధ్యయనం జరిపించాలని నిర్ణయించారు.