విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: భట్టి విక్రమార్క

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: భట్టి విక్రమార్క

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ల్లు అన్నారు. జూన్ 15న తన పుట్టినరోజు వేడుకలను కొత్తపేటలోని  విక్టోరియా మెమోరియల్   హోమ్ ఆర్ఫన్స్ స్కూల్  లో  విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులు, అధికారులు, స్థానిక నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.

విద్య ద్వారానే మానవ వనరులు మెరుగుపడి తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుందన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్యారంగానికి ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు.  రాష్ట్రంలోని ప్రతి బిడ్డ ప్రపంచంతో పోటీపడేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 200 కోట్ల పెట్టుబడితో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నమన్నారు. 

రాష్ట్రంలో మొదటి దశలో 11,600 కోట్లతో 100 పాఠశాలలు నిర్మిస్తున్నమని తెలిపారు.విలువైన విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్నారు. విక్టోరియా మెమోరియల్ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు వెంటనే ఐదు కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ట్రాన్స్కో శాఖలోని CSR ఫండ్స్ నుంచి ఈ కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. నిధులు వెంటనే విడుదల చేస్తాం ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విక్టోరియా మెమోరియల్లో చదువుకుంటున్న అనాధ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.