యాదాద్రి, వెలుగు: యాదాద్రికి నేడుడిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రానున్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాలకు సంబంధించిన రూ. 14.05 కోట్ల అభివృద్ధి పనులకు రిమోట్ ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. టీజీ ఎస్పీడీసీఎల్ యాదాద్రి జిల్లా సర్కిల్ భువనగిరిలో రూ. 5.83 కోట్ల వ్యయంతో నిర్మించిన సర్కిల్ ఆఫీసును ప్రారంభిస్తారు.
భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడిలో రూ. 2.67 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ సబ్స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల సుమారు 1,279 మంది రైతులకు నాణ్యమైన విద్యుత్ అంది లబ్ధి చేకూరుతుంది. భువనగిరి మండలం హనుమపురంలో రూ. 2.03 కోట్లతో నిర్మించనున్న స్టోర్ కాంప్లెక్స్, వలిగొండ మండలం నర్సాపూర్లో రూ. 3.52 కోట్లతో చేపట్టనున్న 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
