మంత్రులంతా ప్రచారం చేసినా సాగర్ లో విజయం నాదే

మంత్రులంతా ప్రచారం చేసినా సాగర్ లో విజయం నాదే

నాగార్జున సాగర్ ను తాను అభివృద్ధి చేయలేదని కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. అభివృద్ధి చేయనిదే 7 సార్లు ప్రజలు నన్ను గెలిపించారా అంటూ ప్రశ్నించారు. సాగర్ సాగు నీటి కష్టాలు తీర్చింది కూడా తానే నన్నారు జానారెడ్డి. 12 మంది మంత్రులు ఇక్కడ పనిచేసినా విజయం తనదేనన్నారు.

తన రాజకీయ జీవితం మొదలయినప్పటి నుంచి ఇప్పటివరకు  సీఎంలను, ఏఐసీసీ నాయకులను ప్రచారానికి రానివ్వలేదని స్పష్టం చేశారు జానారెడ్డి. శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరు అందించామన్నారు. 35 వేల ఎకరాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించింది నిజం కాదా అని అన్నారు. తప్పుడు ప్రచారం చేయడం సరికాదని సూచించారు. TRS నాయకులు అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్పగొప్ప స్కీములు అమలు చేసింది నిజమే అయితే TRS ఎందుకు ప్రచారం చేస్తోందో చెప్పాలన్నారు జానా. ఆశించిన తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ మాత్రమే పరిపాలన అందిస్తుందని స్పష్టం చేశారు.