అమర్​నాథ్ ​యాత్రలోని భైంసా వాసులు సేఫ్​

అమర్​నాథ్ ​యాత్రలోని భైంసా వాసులు సేఫ్​

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా భైంసా నుంచి అమర్​నాథ్​ యాత్రకు వెళ్లిన భక్తులు అక్కడ సురక్షితంగా ఉన్నారు. ఐదు రోజుల కింద భైంసా పట్టణానికి చెందిన 10 కుటుంబాలు అమర్​నాథ్​ యాత్రకు తరలివెళ్లాయి. అయితే, భారీ వర్షాల కారణంగా జమ్ము కాశ్మీర్​ హైవేలో కొండ చరియలు విరిగిపడి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీంతో ఈ మార్గంలో యాత్రను నిలిపివేశారు. అయితే, అక్కడ చిక్కుకుపోయిన భైంసా నుంచి వెళ్లిన బృందాన్ని ఆర్మీ జవాన్లు రక్షించి బేస్​ క్యాంపునకు తీసుకెళ్లారు. రెండ్రోజులుగా తామంగా ఆర్మీ బేస్ ​క్యాంప్​లో సేఫ్​గా ఉన్నామని బృందంలోని గుజ్జల్​వార్​ వెంకటేశ్, రవీందర్​రెడ్డి, కల్యాణ్, సచిన్​లు తెలిపారు.