- 29 సెంటర్ల ప్రిన్సిపాల్స్తో వర్క్షాప్
హైదరాబాద్, వెలుగు : ఎస్సై, కానిస్టేబుల్స్ ట్రైనింగ్ కోసం జరుగుతున్న ఏర్పాట్లపై డీజీపీ అంజనీకుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 పోలీస్ ట్రైనింగ్ సెంటర్ల ప్రిన్సిపాల్స్కు మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు. ట్రైనింగ్ ఐజీ తరుణ్ జోషితో కలిసి వివరాలు తెలుసుకున్నారు. 9,871 స్టైపెండరీ కేడెట్ ట్రైనీ(ఎస్సీటి), సివిల్, ఏఆర్ ,ఐటీ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్, మెకానిక్స్, డ్రైవర్స్ ఇండక్షన్ ట్రైనింగ్కు ముందు ప్రిన్సిపాల్స్కి అవేర్ నెస్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ పొందుతున్నప్పుడు ట్రైనీలకు అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేలా ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.
టీమ్ స్పిరిట్తో టెక్నికల్,స్పోర్ట్స్ స్కిల్స్ పెంపొందించాలని ఆదేశించారు. అభ్యర్ధుల క్రమశిక్షణ అనేది ట్రైనింగ్ సెంటర్ల ప్రిన్సిపాల్స్ బాధ్యత అని సూచించారు. ట్రైనింగ్ ఐజీ తరుణ్ జోషి మాట్లాడుతూ..అత్యంత నాణ్యమైన శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఇండోర్, ఔట్ డోర్ ట్రైనింగ్లో మాడ్యూల్స్ గురించి వివరించారు. ఐజీ రమేష్ మాట్లాడుతూ.. ట్రైనింగ్ సెంటర్లలో రూ.కోటికి పైగా ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించామన్నారు.రూ.17.20 కోట్లతో చాలా వరకు పనులు పూర్తయ్యాయన్నారు. ఇనిస్టిట్యూట్లో ఏదైనా నష్టం జరిగితే ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్ బాధ్యత వహించాలన్నారు.