ముగ్గుతో సెల్ఫీ పంపి..గోల్డ్ గెలుచుకోండి:హెల్త్ డైరెక్టర్

ముగ్గుతో సెల్ఫీ పంపి..గోల్డ్ గెలుచుకోండి:హెల్త్ డైరెక్టర్

తెలంగాణ హెల్త్ డైరెక్టర్  శ్రీనివాస రావు ముగ్గుల పోటీలకు సంబంధించి ట్విట్టర్ లో ప్రకటన చేసి  మరోసారి వార్తల్లో నిలిచారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుతో సెల్ఫీ తీసి వాట్సప్ పంపి..బంగారం గెలుచుకోండంటూ ట్వీట్ చేశారు. విజేతకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేస్తామని తెలిపారు.  ఇందులో మొదటి 10 మందికి బహుమతిగా ఒక గ్రామ్ గోల్డ్..తర్వాతి 50 మంది విజేతలకు 10 గ్రాముల వెండి నాణెం ఇస్తామని చెప్పారు.    

‘సంక్రాంతి సంబరాల్లో భాగంగా భద్రాద్రికొత్తగూడెంలో  డా.జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సెల్పీ విత్ రంగోలి అనే కార్యక్రమం చేపడుతున్నాం.  జిల్లాలోని మహిళలు, యువతులు అందరూ ఈ పోటీల్లో పాల్గొని గోల్డ్ కాయిన్ ను గెలుచుకోవచ్చు. పండుగకు  మీ ఇంటి ముందు మీరు వేసిన ముగ్గుతో సెల్ఫీ లేదా సెల్ఫీ వీడియో తీసి మీ పేరు, గ్రామం, మండలం వివరాలతో   జనవరి 15 సాయంత్రం 6 గంటల లోపు  వాట్సాప్ చేయాలి. ఇందులో లక్కీ డ్రా ద్వారా  ఎంపికైన మొదటి 10 మంది విజేతలకు ఒక గ్రాము గోల్డ్, తర్వాతి 50 మంది విజేతలకు 10 గ్రాముల వెండి నాణెం. 100  కన్సోలెషన్ బహుమతులు ఇస్తాం.  విజేతలకు జనవరి 26న కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీలో  సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రదానం చేస్తాం.’’ అంటూ డీహెచ్  ప్రకటన చేశారు