
- చనిపోయిన 60 ఏండ్ల వ్యక్తికి వైరస్ పాజిటివ్
- 47కు పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
ముంబై: ఆసియాలోని అతి పెద్ద స్లమ్ అయిన ముంబై ధారావిలో కరోనా వైరస్ కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఈ వైరస్ కారణంగా ఐదుగురు చనిపోయారు. సోమవారం మరో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 47కు చేరిందని బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. మదీనా నగర్, జనతా కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, గుల్మోహర్ ఛావల్లో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మరోవైపు సియోన్హాస్పిటల్లో చనిపోయిన 60 ఏండ్ల వ్యక్తికి టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది.