ధారావిలో ఐదో కరోనా మరణం

ధారావిలో ఐదో కరోనా మరణం
  • చనిపోయిన 60 ఏండ్ల వ్యక్తికి వైరస్​ పాజిటివ్​
  • 47కు పెరిగిన మొత్తం కేసుల సంఖ్య

ముంబై: ఆసియాలోని అతి పెద్ద స్లమ్​ అయిన ముంబై ధారావిలో కరోనా వైరస్​ కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఈ వైరస్​ కారణంగా ఐదుగురు చనిపోయారు. సోమవారం మరో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 47కు చేరిందని బ్రిహన్​ ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు వెల్లడించారు. మదీనా నగర్, జనతా కోఆపరేటివ్​ హౌసింగ్ సొసైటీ, గుల్​మోహర్​ ఛావల్​లో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురికి పాజిటివ్​ వచ్చింది. మరోవైపు సియోన్​హాస్పిటల్​లో చనిపోయిన 60 ఏండ్ల వ్యక్తికి టెస్టులు చేయగా పాజిటివ్​ అని తేలింది.