డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం గుడిసె వాసుల ధర్నా

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం గుడిసె వాసుల ధర్నా

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం హన్మకొండలోని అంబేద్కర్, జితేందర్ సింగ్ నగర్ లో 2023 సోమవారం డిసెంబర్ 4న స్థానిక గుడిసెల వాసులు ధర్నా చేపట్టారు. స్థానికంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి 200 మంది గుడిసె వాసులు తామే స్వయంగా వెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని గుడిసె వాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

తమ ఇళ్లను అధికారులు అన్యాయంగా కూల్చేసి.. తమను రోడ్డున పడేశారని ఆరోపించారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించే వరకు ఇక్కడి నుంచి కదలమని డిమాండ్ చేశారు. గుడిసెల వాసులు రోడ్డుపై బైటాయించి ధర్నా చేపట్టారు.