విక్రమ్ ఆరోగ్యంపై ధృవ్ క్లారిటీ

విక్రమ్ ఆరోగ్యంపై ధృవ్ క్లారిటీ

చియాన్ విక్రమ్ ఛాతీలో అసౌకర్యం కారణంగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయన గుండెపోటుకు గురయ్యారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ వివరణ ఇచ్చారు. కాగా విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కూడా తాజా మంరింత క్లారిటీ ఇచ్చారు.

"ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులు నాన్న ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు.. నాన్నకు ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించాము. ఆసుపత్రి వైద్యులు పరీక్షించారు, అవసరమైన వైద్యం అందించింది. నాన్నకు గుండెపోటు రాలేదు, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.. దయచేసి గుండెపోటు అంటు అసత్య ప్రచారం చేయవద్దు. ఈ సమయంలో నాన్నకు, మా కుంటుంబానికి ప్రైవసీ ఇవ్వండి.. చియాన్ ఆరోగ్యంగా ఉన్నారు. నాన్నకు చికిత్స పూర్తికాగానే ఆసుపత్రి నుండి డిచ్చార్జ్ అవుతారు. తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యవద్దు" అని ధృవ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

కాగా, విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై కావేరీ ఆసుపత్రి తాజా ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ బులెటిన్ విడుదల చేసింది. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో విక్రమ్ ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు తెలిపారు. విక్రమ్ కు అవసరమైన వైద్యం అందించామని వెల్లడించారు. ఆయనకు గుండెపోటు లక్షణాలేవీ లేవని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య బృందం వివరించింది. త్వరలోనే విక్రమ్ ను డిశ్చార్జి చేస్తామని కావేరీ ఆసుపత్రి తన ప్రకటనలో పేర్కొంది.