
హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సీతా పయనం’.ఆయన కూతురు ఐశ్వర్య, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ జంటగా నటించారు. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. బుధవారం ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్కు సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘కూతురు కోసం సినిమా చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో ఓ తండ్రిగా నాకు తెలుసు. అర్జున్ గారి కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. నా సినిమాల్లో స్క్రీన్ ప్లేకు ఉపేంద్ర గారి సినిమాలే కారణం. ఇందులో ఓ పాట విన్నా. నిరంజన్ ఐశ్వర్య చాలా బ్యూటిఫుల్గా కనిపించారు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు.
ఉపేంద్ర మాట్లాడుతూ ‘కాలేజీ రోజుల్లో నాకు డైలాగ్ రైటర్గా అవకాశం ఇచ్చిన అర్జున్ గారు.. ఇప్పుడు మా అన్నయ్య కొడుకుకి అవకాశం ఇచ్చారు. టీజర్ బ్యూటిఫుల్గా ఉంది. చివర్లో అర్జున్ గారు, ధ్రువ రావడం గొప్ప థ్రిల్ ఇచ్చింది’ అన్నారు.
అర్జున్ సర్జా మాట్లాడుతూ ‘మా అమ్మాయి టాలెంట్, హార్డ్ వర్క్ చూసి ఒక మంచి సినిమా తీయాలని దీన్ని స్టార్ట్ చేశా. జనాలకి నచ్చుతుందని నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమాభిమానాలను మా అమ్మాయిపై కూడా చూపించాలని కోరుకుంటున్నా. ఇందులో వర్సటైల్గా ఉండే పాత్రలో నిరంజన్ చాలా బాగా నటించాడు.
ఈ కథని మొదట చిరంజీవి గారికి చెప్పాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఓపెనింగ్కు వచ్చి సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్స్’అన్నారు. హీరోహీరోయిన్స్ నిరంజన్, ఐశ్వర్య అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, లిరిక్ రైటర్ చంద్రబోస్, కొరియోగ్రాఫర్ సృష్టి తదితరులు పాల్గొన్నారు.