రూ. 500 కోట్లు ఉన్నోడికి కూడా బయోపిక్ చేయాలట.. ఇదే నా చివరి బయోపిక్

రూ. 500 కోట్లు ఉన్నోడికి కూడా బయోపిక్ చేయాలట.. ఇదే నా చివరి బయోపిక్

యాత్ర(Yatra) సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మహి వీ రాఘవ్(Mahi V Raghav). ఆయన దర్శకత్వంలో యాత్ర మూవీకి కొనసాగింపుగా.. యాత్ర2(Yatra2) కూడా వస్తోంది. ఇటీవలే అఫీషియల్ గా మొదలైన ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి(Ys Rajashekara reddy)  జయంతి సందర్భంగా శనివారం ఈ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సంధర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో దర్శకుడు మహి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా ఒక రిపోర్టర్.. యాత్ర2 తరువాత మళ్ళీ బయోపిక్స్ తీస్తారా? పవన్ కళ్యాణ్(Pawan kalyan), చంద్రబాబు(Chandra babu) బయోపిక్ లు తీసే అవకాశం ఉందా? మిమ్మల్ని ఎవరైనా బయోపిక్ తీయమని అడిగితే మీ సమాధానం ఏంటి? అని అడిగారు. దానికి సమాధానంగా మహి.. "ఇకపై నేను బయోపిక్ లు చేయను. బహుశా ఇదే లాస్ట్ బయోపిక్ అవ్వొచ్చు. నేను మళ్ళీ పొలిటికల్ సినిమా చేయకపోవచ్చు. నేను యాత్ర మూవీ చేసినందుకే.. చాలా మంది నన్ను బయోపిక్ చేయమని అడుగుతున్నారు. రూ.500 కోట్లు ఉన్నోడు కూడా అతని కథని బయోపిక్ గా తీయమంటున్నారు అని చెప్పుకొచ్చారు దర్శకుడు మహి. ప్రస్తుతం మహి వీ రాఘవ్ చేసిన ఈ కామెంట్స్ ఇటు ఇండస్ట్రీ పరంగా, అటు పొలిటికల్ పరంగా హాట్ టాపిక్ గా మారాయి.