ఆర్ఆర్ఆర్ లాగే సలార్ కూడా ఇద్దరి స్నేహితుల కథ: ప్రశాంత్ నీల్

ఆర్ఆర్ఆర్ లాగే సలార్ కూడా ఇద్దరి స్నేహితుల కథ: ప్రశాంత్ నీల్

ప్రస్తుతం ఇండియా వైడ్ గా సినిమాటిక్ యువర్స్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ డైరెక్టర్స్ తమ ప్రీవియస్ సినిమాలకు లింక్ చేస్తూ కొత్త కొత్త కథలను తయారు చేస్తున్నారు. ఆలా ఆడియన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తున్నారు. ఒక సినిమాకి మరో సినిమాతో  లింక్ ఉండటం, ఆ సినిమాలో హీరో మరో సినిమాలోకి రావడం.. అనే కాన్సెప్ట్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఆడియన్స్ కూడా ఆ ఎలిమెంట్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో శైలేష్ కొలను, తమిళ్ లో లోకేష్ కనగరాజ్, హిందీలో యాష్ రాజ్ ఫిల్మ్స్ తమ సినిమాటిక్ యూనివర్స్ లో సినిమాలు చేస్తున్నారు. 

అలాగే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను మొదలుపెట్టినప్పుడు కూడా అలానే అనుకున్నారు ఆడియన్స్. సలార్ సినిమాతో  కేజీఎఫ్ సినిమాకు లింక్ ఉంటుందని, సలార్ సినిమాలో రాకీ భాయ్ వస్తారని భావించారు. దీనిపై చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సలార్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. సలార్ రిలీజ్ దగ్గరపడుతున్న వేల ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పారు. 

అదేంటంటే.. ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాకు కేజీఎఫ్ కు ఎలాంటి సంబంధం ఉండదట. ఇదే విషయంపై ప్రశాంత్ మాట్లాడుతూ.. సలార్ సినిమాకి KGFకి ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు వేరు వేరు ప్రపంచాలు. పెద్ద హీరోలతో సినిమా చేసేటప్పుడు వాటిని సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకోచ్చి దానికి మల్టీస్టారర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మన స్టార్ హీరోలకుక్ మనమిచ్చే రెస్పెక్ట్. అందుకే సలార్ సినిమాకు వేరే ఏ సినిమాతో కనెక్షన్ ఉండదు. మొత్తం ఆరు గంటల కథతో తెరకెక్కుతోంది ఈ సినిమా. అందుకే రెండు పార్ట్స్ గా చేశాము. ఇక సలార్ సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ. వాళ్ళు శత్రులుగా ఎందుకు మారారు? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.. అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్. ఇక సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.