SS Rajamouli: నా అబ్బాయిలు మళ్లీ వచ్చారు..రాజమౌళి ట్వీట్ వైరల్

SS Rajamouli: నా అబ్బాయిలు  మళ్లీ వచ్చారు..రాజమౌళి ట్వీట్ వైరల్

మత్తు వదలరా’ చిత్రంతో సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న కీరవాణి కొడుకు శ్రీసింహ కోడూరి... ఇప్పుడు దీని సీక్వెల్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సత్య, ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే నెక్స్ట్ లెవల్‌‌‌‌‌‌‌‌లో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా సీక్వెల్ ఉంటుందని తాజాగా రిలీజ్ చేసిన టీజర్ బట్టి అర్ధమైంది. దీంతో ఆడియన్స్ తోపాటు సినీ ప్రముఖుల్లో కూడా సినిమాపై ఆసక్తి నెలకొంది. 

రాజమౌళి ట్వీట్:

తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తన ఎక్స్ ఖాతా ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. "హీ హీ హీ.. హీ టీమ్‌. నా అబ్బాయిలు మత్తు వదలరా 2తో మళ్లీ వచ్చారు. టీజర్‌లోని డైలాగ్స్‌ మంచి ఫన్‌ను పంచాయి. విజువల్స్‌ అద్భుతం. సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబరు 13న టికెట్లు తస్కరించేందుకు అందరూ సిద్ధం’ అని రాజమౌళి రాసుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 టీజర్ విషయానికి వస్తే  

ఇందులో హీరో శ్రీ సింహా, కమెడియన్ సత్య కామెడీ డైలాగులతో నవ్వించారు. వెల్‌కమ్‌ టు ‘హీ’ టీమ్‌ అంటూ సాగే ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. హి..హి..హి.. టీమా అంటే అన్నీ హిలు లేవు.. ఒకటే హి అంటూ ఫన్నీగా సాగుతున్న డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గు లేదా.. అంటుంటే.. అయినా ఇది దొంగతనం కాదు.. తస్కరించుట అంటున్నాడు సత్య. ఫస్ట్ పార్ట్ కంటే నెక్స్ట్ లెవల్‌‌‌‌‌‌‌‌లో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా ఉంటుందని విషయం టీజర్ తో అర్ధమవుతోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.