మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ (Padma Vibhushan) అవార్డు వరించడం పట్ల..సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
లేటెస్ట్గా దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) తనదైన శైలిలో పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవికి అభినందనలు తెలిపారు. 'ఎక్కడి నుంచో, వచ్చి..పునాదిరాళ్లకు మొదటి రాయి వేసిన ఒక కుర్రాడు..భారతదేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం గ్రహీతగా నిలిచారు. మీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది చిరంజీవి గారూ'..అంటూ రాజమౌళి పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటుడుగా, రాజకీయ నాయకుడుగా..సమాజ సేవకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన చిరుకి ఈ అవార్డు రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు.
ప్రస్తుతం చిరంజీవి 68 ఏళ్ళ వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు మల్లిడి వశిష్టతో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు.
రాజమౌళి విషయానికి వస్తే..బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చి..పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఆర్ఆర్ఆర్(RRR) వంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి..మహేష్తో భారీ బడ్జెట్ తో హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కిస్తున్నాడు.
From nowhere, a boy who laid the first stone for Punadhirallu to becoming the recipient of the second-highest civilian award in India… Your journey inspires generations Chiranjeevi Garu. ??????
— rajamouli ss (@ssrajamouli) January 26, 2024
Congratulations on receiving the Padma Vibhushan. @KChiruTweets