సీఎంను కలిసిన ఎస్వీ కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి

సీఎంను కలిసిన ఎస్వీ కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డితో సీఎం కాసేపు ముచ్చటించారు.

రేవంత్​ను కలిసిన ఆర్టీసీ యూనియన్​ నేత

రాష్ట్ర కాంగ్రెస్​ ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ ఆర్టీసీ స్టాఫ్​వర్కర్స్ ​యూనియన్ ​సెక్రటరీ జనరల్​ హనుమంతు ముదిరాజ్​ శనివారం సీఎం రేవంత్​రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.  బీఆర్ఎస్​పార్టీని రేవంత్ మట్టి కరిపించి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి  తీసుకువచ్చారని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎంకు వివరించినట్టు హనుమంతు వెల్లడించారు.