Siddharthroy: అతని చేతిలో సినిమా నలిగిపోతోంది..డెబ్యూ డైరెక్టర్ ఆవేద‌న

Siddharthroy: అతని చేతిలో సినిమా నలిగిపోతోంది..డెబ్యూ డైరెక్టర్ ఆవేద‌న

సినిమాల్లో అవకాశం రావడానికి ఎంతలా కష్టపడుతారో ప్యాషన్ ఉన్న ప్రతి కుర్రాడికి తెలుసు.ఒక్క అవకాశం వస్తే చాలు..నేనేంటో ప్రూవ్ చేసుకుంటా..అసలు వెనక్కి చూసుకోకుండా జర్నీ సాగిస్తా అంటూ..సక్సెస్ అవ్వనంత వరకు ఈ మాటలు వస్తుంటాయి. అల్ మోస్ట్ సినిమాపై పిచ్చి ఉన్నోల్లు అందరూ ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అందులో కొందరు సక్సెస్ అయ్యాక..ఇచ్చిన కమిట్ మెంట్స్కి నిజాయితిగా పనిచేయగా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్కి ఇరిటేశన్ వచ్చేలా ప్రవర్తిస్తుంటారు. ఇపుడు అలానే సిద్దార్థ్ రాయ్ మూవీ మ్యూజిక్ డైరక్టర్ రధన్ మేకర్స్కి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే..రథన్ సంగీతం సమకూర్చిన లేటెస్ట్ మూవీ 'సిద్ధార్థ్ రాయ్' (Siddharthroy). 

సిద్ధార్థ్ రాయ్ రేపు శుక్రవారం (ఫిబ్రవరి 23న) థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన, కోన వెంకట్ లాంటి ప్రముఖులు అటెండ్ అయ్యారు. 

ఈ సందర్భంగా సిద్ధార్థ్ రాయ్ మూవీ డైరెక్టర్ యశస్వి (Yashasvi) మాట్లాడుతూ..సినిమా ఇంత లేట్ అవ్వడానికి మ్యూజిక్ డైరెక్టర్ రధన్ ప్రధాన కారణమంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అతను ఇపుడు చెన్నైలో ఉండి బ‌తికిపోయాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా త్వరగానే షూటింగ్ అయిపోయింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే డిలే అవుతూ వస్తుంది..దానికి కారణం రధన్ అనే మ్యూజిక్ డైరెక్టర్. నాలాగా ఎవరూ మోసపోకూడదనే ఈ విషయం చెప్తున్నాను. అతను అధ్బుతమైన టెక్నీషియన్ అనుకోని మనం అక్కడికి వెళ్తున్నాం. కానీ అతని చేతిలో పడి సినిమా నలిగిపోతోంది. దీనికి ఉదాహరణగా జరిగిన ఇన్సిడెంట్ గురించి చెబుతూ..రధన్ అనే వ్యక్తి గొడవ పడటానికే మాట్లాడతాడు' అని డైరెక్టర్ యశస్వి అన్నారు. 

"ఒక సిచ్యువేషన్ కోసం డిస్కర్ చేయటానికి అపాయింట్ మెంట్ అడిగితే రేపు రేపు అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. ఒకరోజు నేను రెక్కీ కోసం వైజాగ్ వెళ్తున్నప్పుడు రాజమండ్రిలో అతని నుంచి నాకు ఫోన్ వచ్చింది..ఇక ఆ కాల్ ఎండ్ అయ్యేసరికి వైజాగ్ వచ్చేసింది. రథన్ ఎంతగా ఆర్గుమెంట్ చేస్తాడో ఒక్కసారి ఊహించుకోండి. అతను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, బాగా వర్క్ చేస్తాడు అనేది అటుంచితే.. సినిమాని కంప్లీట్ గా ఒక కార్నర్ కి తీసుకెళ్ళి మనల్ని వదిలేస్తాడు. రథన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు..అక్కడ ఉండి బతికిపోయాడు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉంటే చాలా గొడవలు అయ్యేవి" అని యశస్వి ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. మరి ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రధన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. 

మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై ఇలాంటి విమ‌ర్శ‌లు రావ‌డం కొత్తేమీ కాదు. ‘అర్జున్ రెడ్డి’ టైంలోను ఇలాంటి సమస్యే వచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అతనిపై ఓ ఇంటర్వ్యూలో తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాడు. ఏదేమైనప్పటికీ..ఎంత పెద్ద టెక్నీషియన్ అయిన ఇచ్చిన కమిట్ మెంట్ కు బాధ్యతగా ఉండాల్సిందే. లేకపోతే సినిమానే నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి తలక్రిందులవుతుంది. 

ఇక మ్యూజిక్ డైరెక్టర్ రధన్ సినిమాల విషయానికి వస్తే..'అందాల రాక్షసి' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ రెడ్డి, హుషారు, జాతి రత్నాలు, పాగల్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన పాటలు సమకూర్చారు. చిట్టీ, ఉండిపోరాదే లాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించి టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 
 
మహేశ్ బాబు అతడు మూవీలో కమెడియన్ బ్రహ్మానందం పొట్టపై చిన్న పంచ్ ఇచ్చి..మన స్కూల్ బెంచ్‌లా ఎంత గట్టిగా ఉందోరా..అనే డైలాగ్తో ఆకట్టుకున్న బుడ్డోడు అందరికీ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే. అతడులో నటించిన అతనే దీపక్ సరోజ్ (Deepaksaroj). ఇప్పుడు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రాయ్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్స్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన యశస్వీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.